అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం నుంచి దీపావళి సర్ప్రైజ్ వచ్చేసింది. పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వెలుగుల పండుగ సందర్భంగా రాజమౌళి, రామ్చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ ఫొటోషూట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసిన చిత్రబృందం.. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ దీవాళి ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంది. రాజమౌళి, ఎన్టీఆర్, చెర్రీ సరదాగా మాట్లాడుకుంటూ.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి అనుకోని విధంగా సర్ప్రైజ్ రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. లైకులు, షేర్స్తో తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది నెటిజన్లు.. ‘సూపర్ పిక్స్.. ఇంటర్వ్యూ ఏమైనా ఉందా?’ అంటూ కామెంట్లు పెట్టగా. అలాంటిది ఏమీ లేదని చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.