శ్రుతిహాసన్ ‘వకీల్సాబ్’ కోసం వచ్చే నెల నుంచే కెమెరా ముందుకు వెళుతున్నట్టు చెప్పింది. పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘వకీల్సాబ్’లో శ్రుతి కథానాయికగా నటిస్తోంది. ‘పింక్’కి రీమేక్గా రూపొందుతున్న చిత్రమిది. వేణు శ్రీరామ్ దర్శకుడు. అయితే మాతృకకి భిన్నంగా ఇందులో ప్రధాన కథానాయిక పాత్రని సృష్టించినట్టు సమాచారం. అందులోనే శ్రుతి నటించబోతోంది. అయితే అందులో ఎవరు నటిస్తారనేది ఇప్పటిదాకా అధికారికంగా బయటికి రాలేదు. ఎట్టకేలకు శ్రుతి ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటిస్తూ ‘వకీల్సాబ్’లో నటిస్తున్న విషయాన్ని ఖరారు చేశారు. పవన్ కల్యాణ్తో కలిసి శ్రుతి నటిస్తున్న మూడో చిత్రమిది. ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాలతో ఈ జంట అలరించింది.