కాస్త ఆలస్యమైనా అగ్ర కథానాయకులు ఒకొక్కరుగా చిత్రీకరణల కోసం రంగంలోకి దిగుతున్నారు. కరోనా ఉద్ధృతితో నిలిచిపోయిన సినిమాల్ని పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్నారు. పవన్కల్యాణ్ కథా నాయకుడిగా నటిస్తున్న ‘వకీల్సాబ్’ చిత్రీకరణ ఇప్పటికే పునః ప్రారంభమైంది. ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న అంజలి, నివేదా థామస్ తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగే సమయం వచ్చింది. దసరా పండగ తర్వాత ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ నెల చివరి నుంచి పవన్ కల్యాణ్తోపాటు, శ్రుతిహాసన్లపై సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో విజయవంతమైన ‘పింక్’కి రీమేక్గా రూపొందుతున్న చిత్రమిది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్రాజు నిర్మిస్తున్నారు.